
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ వంటి నగరాల్లో, నేరాలను నియంత్రించడానికి మరియు ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిదిలో గల దాతల సహకారంతో 30 కొత్త CC కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సీసీ కకెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పి. సాయి చైతన్య, ఐపిఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి టౌన్ 6 పోలీస్ స్టేషన్ లో గల కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు స్థానిక భాష (ఉర్దూ) లో వివరించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
* కమ్యూనిటీ భాగస్వామ్యం: ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో స్థానిక ప్రజలు మరియు వ్యాపారులు సహకరించినందుకు పోలీస్ కమిషనర్ వారిని అభినందించారు. మరిన్నీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వారిని కోరడం జరిగింది.
* నేరాల నియంత్రణ: సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో మరియు నేరస్తులను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తక్కువగా జరుగుతాయని, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని తెలిపారు.
* ట్రాఫిక్ నిర్వహణ: కొన్నిసార్లు సీసీ కెమెరాలు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి ఆక్సిడెంట్ వాహనాలను గుర్తించడంలో సహాయ పడతాయని అన్నారు.
* ప్రజల భద్రత: సీసీ కెమెరాలు ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తాయని, తమ ప్రాంతంలో నిఘా ఉందనే విషయం ప్రజలకు ధైర్యాన్నిస్తుందని వివరించడం జరిగింది.
* సాంకేతికత వినియోగం: పోలీస్ శాఖ నేరాల నియంత్రణలో సాంకేతికతను ఎలా ఉపయోగిస్తుందో వివరించి, కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యంను మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.
* భవిష్యత్ ప్రణాళికలు: భవిష్యత్తులో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రణాళికల గురించి మరియు నగరంలో భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల గురించి తెలియజేశారు.
ప్రసంగంలోని కమిషనర్ కొన్ని మాటలు:
“ఈరోజు మనమందరం కలిసి మన ప్రాంతంలో కొత్తగా సీసీ కెమెరాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కెమెరాలు కేవలం ఒక నిఘా వ్యవస్థ మాత్రమే కాదు, ఇది మనందరి భద్రతకు ఒక పెద్ద అండ. గతంలో నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు, సీసీ కెమెరాల సహాయంతో క్షణాల్లో వారిని పట్టుకోగలుగుతున్నాం.
ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ప్రజలకు, వ్యాపారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరంతా ఇలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలందరూ కూడా తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే, మన నగరాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చవచ్చు అని తెలియజేశారు.”
ఇట్టి సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో L. రాజా వెంకట్ రెడ్డి, ACP, నిజామాబాద్, N. సురేష్ కుమార్ CI South Rural, K. వెంకట్ రావ్, SI, PS. Town-VI, S. శ్రీనివాస్ PSI, PS. Town-6 సిబ్బంది మరియు దాతలు పాల్గొన్నారు.