
దేశానికి సాంకేతిక రంగాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ లు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ దోండి రమణ, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, సీనియర్ నాయకులు చిక్కు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.