
ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవో యూనిట్ కార్యాలయంలో అధ్యక్ష కార్యదర్శులు కుంట శశికాంత్ రెడ్డి, విశాల్ అధ్యక్షతన యూనిట్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయిస్ JAC జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మరియు జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ లు హాజరయ్యారు. ఎజెండా అంశాలపై జిల్లా అధ్యక్షులు సుమన్ మాట్లాడుతూ సమావేశ సమయానికి క్రమశిక్షణతో సకాలంలో హాజరై అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించినందుకు అభినందనలు తెలిపారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ నేతృతంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పరిష్కరిస్తూనే ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఉద్యమ కార్య చరణను ఇదివరకే ప్రకటించినప్పటికీని, ఉద్యమ కార్యచరణలో కొన్ని మార్పు చేర్పు జరుగుతున్నాయి తప్ప ఉద్యోగుల హక్కుల సాధన జరిగెంతవరకు ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో పక్షాన హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అతిక్, జిల్లా జాయింట్ సెక్రటరీ జాఫర్ హుస్సేన్, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, నిజామాబాద్ అర్బన్ యూనిట్ కార్యదర్శి మారుతి, భీంగల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, సలహాదారులు వనమాల సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుల స్వామి, సునీల్, వసతి గృహ సంక్షేమ అధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచందర్, ఆర్మూర్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.