
భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఆయన దేశానికి ఎన్నో మంచి పనులు చేశారని 18 సంవత్సరాలు యువతకు ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేసిన గొప్ప వ్యక్తి అని, పంచాయతీ రాజ్ వ్యవస్థలో సవరణలు తీసుకొచ్చి గ్రామానికి కేంద్ర ప్రభుత్వానికి వారధిగా నిలిచారని అన్నారు. మన దేశంలో ఐటి రంగంలో ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపి ఐటీ రంగానికి పునాదులు వేసి దానిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లిన గొప్ప జ్ఞాని అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, గంగాధర్, కిషన్, చింటూ, నల్లూరి శీను తదితరులు పాల్గొన్నారు.