
భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆర్మూర్ పట్టణ మాజీ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ పాల్గొని రక్తదానం చేశారు. యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల శ్రీనివాస్ గౌడ్, పాండ్యాల కిరణ్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.