
భీంగల్ పట్టణంలోని మూడవ వార్డు మరియు 11వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా నిబంధన మేరకు నిర్మాణం జరిగేలా చూస్తామని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, ఆర్ ఐ రాజేశ్వర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.