
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆలూర్ ZPHS సమ్మర్ క్యాంపులో 12వ రోజు విజయవంతంగా క్లాసులు జరుగుతున్నాయి. గురువారం విద్యార్థులు చిత్రలేఖనంతో పాటు మంచి పాటలతో అలరించారు. వారిని అభినందిస్తూ ఎంఈఓ M. నరేందర్ పుష్పగుచ్చాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు M. రణవీర్ , చిత్రలేఖనము ,శాస్త్రీయ సంగీతం పై శిక్షణనిస్తున్న ఆర్టిస్ట్ ముత్యం, నృత్య ,శిక్షకురాలు స్నేహ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకురాలు సువర్ణ తదితరులు పాల్గొన్నారు.