
JAYNEWSTV: ఆర్మూర్, టౌన్ మే 23 ( జయ్ న్యూస్ ): ఆర్మూర్ మున్సిపాలిటీలో శుక్రవారం ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత అమృత మిత్రులు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఉన్నటువంటి మార్పులను తట్టుకునేందుకు పట్టణాల్లో పెరుగుతున్న వేడిని తగ్గించేందుకు బ్లూ గ్రీన్ మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు “ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం” ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో TMC ఉదయశ్రీ, CC రాజలింగం, వినాయక, శివ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.