
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ న్యూరో & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మరిన్ని సేవలు ద్వారా పేరు ప్రఖ్యాతులు చూరగొనాలని ఆకాంక్షించారు. ఆస్పత్రి యాజమాన్యం సేవా దృక్పథంతో ప్రజలకు సేవలందించాలని వారు ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను, సౌకర్యాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtu.be/IzrwQKgpo5Y?si=hQBb52Q6FBHjj6Uq