
జయ్ న్యూస్, ఆర్మూర్: PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా భీంగల్ పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోదిరే స్వామి ఆధ్వర్యంలో లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి మందిరంలో ఆయన పేరిట అర్చన చేయించి గుట్టపై ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో శనివారం అన్నదాన కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని వారి కుటుంబానికి లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.