
జయ్ న్యూస్, భీమ్ గల్: మండలం పరిధిలోగల లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాలను తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. లింబాద్రిగుట్ట దిన దినాభివృద్ధి చెందుతుందని, కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా వీరాజిల్లుతున్నారని భక్తుల ప్రగడ విశ్వాసం. స్వామి వారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతున్నాయని పలువురు భక్తులు తెలిపారు.