
జయ్ న్యూస్, సిరికొండ: రాజకీయాలకతీతంగా రైతు సంఘం నిర్మాణం జరగాలని, తమ సమస్యల పరిష్కారం కోసం రైంతంగం ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునీచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో శనివారం నాడు అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) సభ్యత్వ కార్యక్రమాన్ని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అబలంబిస్తుంది అన్నారు. కొత్త రైతు చట్టాలను తెచ్చి విశారంగాన్ని కార్పొరేట్లకు దారతత్వం చేయడానికి, ఆదాని, అంబానీ లాంటి వారికి వ్యవసాయ రంగం అప్పగించడానికి భారతరత్ంగాని బలి పశువు చేశారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా, ఎం.ఎస్ చట్టం చట్టబద్ధ కోసం సుదీర్ఘంగా ఢిల్లీలో రైతాంగం పోరాడితే రైతాంగ సమస్యలు పరిష్కారం చేస్తామని రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చినా మోడీ పూర్తిగా విస్మరించి రైతులను నట్టేట ముంచారన్నారు. ఈరోజు రైతాంగం అన్నవో రామచంద్ర అన్న కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. రైతులంతా రాజకీయ అతీతంగా రైతు సంఘం గా ఏర్పాటు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా గాలికి వదిలేసి చేతులు దులుపుకున్నది అన్నారు. రైతన్నకి ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) జిల్లా నాయకుడు ఏం లింబాద్రి, సిరికొండ మండల కమిటీ అధ్యక్షులు ఏం నారా గౌడ్,జిల్లా నాయకులు కే రాంజీ, ఎండి. అనిస్, బి. కిశోర్, ఎస్. కిశోర్, ఎస్.కిరణ్, ఎల్. నరేష్, టీ. భూమాగౌడ్, జే.బాల్ రెడ్డి, జే. ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.