
జయ్ న్యూస్, ఆర్మూర్: వరద నీరు ఇళ్లలోకి చేరకుండా కల్వర్టులు నిర్మించాలని ఆర్మూర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు ఆదివారం బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాలనీలో తారు రోడ్డు ఎత్తుగా వేయడం వల్ల, సరైన కల్వర్టులు లేక పైన ఉన్న జర్నలిస్టు కాలనీ, వడ్డెర కాలనీ, దూదేకుల కాలనీ, రంగాచారి కాలనీలోని వరద నీరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోకి చేరి రోడ్డు ఎత్తుగా ఉండడంతో ఇళ్లలోకి చేరుతున్నాయని వారు ఎమ్మెల్యే విన్నవించారు. కమిషనర్ తో మాట్లాడి కల్వర్టు నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నాయిని భాస్కర్, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, నాయకులు తదితరులు ఉన్నారు.