
జయ్ న్యూస్, ఆర్మూర్: పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహేష్, ఆదిత్య తమ ఫోన్లు పోగొట్టుకోగా CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఆదివారం బాధితులకు అప్పగించామన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను తిరిగి అందజేసినందుకు బాధితులు సీఐ సత్యనారాయణ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.