
జయ్ న్యూస్, ఆర్మూర్: “ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సంస్థ” ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని వివిధ దేవాలయాల్లో చేస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలు అభినందనీయమని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనిలో గల హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శత హనుమాన్ చాలిసా పారాయణం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుంకే శ్రీనివాస్ ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ స్థాపించి గత 5 వారాలుగా ఆర్మూర్ పట్టణంలోని వివిధ దేవాలయాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తునారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పల్గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్, లింబాద్రి గుట్ట అస్థాన అర్చకులు నంబి శ్రీనివాస్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు, హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.