
జయ్ న్యూస్, ఆర్మూర్: “ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సంస్థ” చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆర్మూర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజి చౌక్ వద్ద గల శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమాలు మరింతగా విస్తరించి ఆర్మూర్ ను స్వచ్ఛ ఆర్మూర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజున ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి ఆలయం ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆలయం చుట్టు ఉన్న చెత్త చెదారాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, జీడి రాజ్ కుమార్, సాయి కిరణ్, జెంగిడి బోజన్న, మధుసుధన్, బొగడమీది గంగారెడ్డి, రాకేష్, ఆదిత్య, జక్కం గంగా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
https://youtu.be/kdAuu36vLZg?si=X6MlF7uql6ZJQN9A