
జయ్ న్యూస్, డొంకేశ్వర్: డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామంలో ఒకరికి 20వేల రూపాయల CMRF చెక్కును పంపిణీ చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చెక్కు మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్, సీనియర్ నాయకులు డిసిసి డెలిగేట్ మోతే చిన్న సాయన్న, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్, బూత్ కమిటీ అధ్యక్షులు మగ్గిడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.