
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన ఆధ్వర్యంలో అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని సూచించారు. రక్తహీనతకు గురికాకుండా బెల్లం, బీట్రూట్ వంటి రక్తం వృద్ధి చెందినటువంటి పదార్థాలు అధికంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ అనవాల, హెల్త్ సూపర్వైజర్ అనసూయ కుమారి, స్టాఫ్ నర్స్ లు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.