
జయ్ న్యూస్, భీంగల్: పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాపూజీ నగర్ లో ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భీంగల్ సీఐ, ఆర్మూర్ సీఐ, ఆర్మూర్ రూరల్ సీఐ మరియు భీంగల్ ఎస్సై, సబ్ డివిజన్ ఎస్సైలు మరియు సిబ్బంది కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ACP వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి, హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తూ ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ తోడ్పాటు అందించాలని కోరారు. ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఇంటి యజమానులు వారింట్లో గదులకు కిరాయికి ఇస్తే ఆ వ్యక్తులు యొక్క ఆధార్ కార్డులు సంబంధిత గుర్తింపు కార్డులు పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే కిరాయిలకు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా సంబంధిత కాలనీలలో సీసీ కెమెరాలు, ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అయితే ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.