
జయ్ న్యూస్, ఆర్మూర్: పట్టణంలోని 24వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన ప్రోసీడింగ్ ని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టెల శ్రావణ్ కుమార్ మరియు మున్సిపల్ అధికారులు లబ్ధిదారులకు అందించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు కృషి చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు అన్ని విధాలుగా సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు.