
https://youtu.be/Jh2HhgzVnbo?si=wOsUqGLAyoMhegBA
జయ్ న్యూస్: ఆర్మూర్, మే 27: నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు గంగా మోహన్, చరణ్ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష, కార్యదర్శుల కార్యవర్గం ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభమై ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తుందని తెలిపారు. ప్రెస్ క్లబ్ ప్రతి సభ్యుడు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ విలువైన ఓటుతో పోటీలో నిలబడిన అభ్యర్థులను సమర్థవంతమైన నాయకత్వాన్ని గెలిపించాలని వారు కోరారు.