
జయ్ న్యూస్, వేల్పూర్: మండల కేంద్రంలోని బీసీ కాలానికి చెందిన కోమన్ పల్లి శ్రీవల్లి హైదరాబాదులో మంగళవారం రోజు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో భరతనాట్యం చేసి అందరి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా శ్రీ వల్లి మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుండి నృత్యం అంటే చాలా ఇష్టమని చెప్పింది. తల్లిదండ్రుల కృషి వల్ల డ్యాన్స్ స్కూల్లో చేరినట్లు స్పష్టం చేసింది. డ్యాన్స్ భరతనాట్యం నేర్చుకొని ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు.