
జయ్ న్యూస్, ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో జ్యోతికి 22000, విజయకు 20000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తాజా మాజీ కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. తమకు చెక్కులు అందజేసినందుకు లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.