
జయ్ న్యూస్, ఆర్మూర్: జర్నలిస్టులు సమాజానికి తమవంతుగా చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు చౌల్ సందీప్, కోశాధికారి అబ్దుల్ అజీమ్, జాయింట్ సెక్రటరీ ఎలిగేటి చక్రధర్, ఈసీ మెంబర్లు రాచర్ల వార్ చేతన్, సామ మురళి లను శాలువాలతో సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ వార్తల సేకరణలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారని, జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్జు భాయ్, ఫహీమ్, భూపేందర్, జో శ్రీను తదితరులున్నారు.