
జయ్ న్యూస్, హైదరాబాద్: బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్మూర్ మున్సిపల్ ఉద్యోగి నరేష్ ను పరామర్శించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు, పెండింగ్ లో ఉన్న ESI బకాయిలు చెల్లిస్తే, ఈఎస్ఐ ద్వారా మెరుగైన చికిత్స, అలాగే ఉచిత చికిత్స లభిస్తుందని తెలుపగా, వెంటనే మున్సిపల్ కమిషనర్ కి తెలియజేసి పెండింగ్ లో ఉన్న 36 లక్షల రూపాయల బకాయిలను ఈఎస్ఐ వారికి చెల్లింప చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సనత్ నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి నిజామాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి నుండి రికమెండ్ కూడా చేయించడం జరిగిందన్నారు. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దీనికి సంబంధించి మెరుగైన చికిత్స లేనిచో, యశోద ఆసుపత్రిలోనే ఉంచి ఈఎస్ఐ ద్వారా ఆసుపత్రి బిల్లులు చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.