
జయ్ న్యూస్, ఆర్ సి రెడ్డి, ధర్పల్లి, మే 29: గురువారం ధర్పల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి నక్క రాజేందర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంలో నక్క రాజేందర్ మాట్లాడుతూ, మాదిగల ఆశ జ్యోతి, మాదిగల మహాత్ముడు, 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేసిన యోధుడు వర్గీకరణ సాధించిన మన నాయకుడు మంద కృష్ణ మాదిగ అని చెప్పారు.పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసారు. 31-05-2025 (శనివారం) వరంగల్ నగరంలో ఘన స్వాగత సభ జరుగుతుందని, అందువలన ధర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల మాదిగ, ఉపకుల సోదరులు పెద్ద ఎత్తున వరంగల్కు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మొట్టల దీపక్ మాదిగ (MRPS సిరికొండ), గుంటి నర్సయ్య మాదిగ, పూసిన భాస్కర్ మాదిగ, గొట్టిముక్కుల నర్సయ్య మాదిగ, రాజేష్ మాదిగ, సభవత్ రాములు తదితరులు పాల్గొన్నారు.