
జయ్ న్యూస్, ఆర్మూర్: పట్టణానికి చెందిన జీవన్ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 2,50,000 రూపాయల LOC మంజూరు చేయించారు. గురువారం LOC కాపీని బాధిత కుటుంబానికి వినయ్ రెడ్డి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు వినయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ అమృత్ రావు, నటరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.