
జయ్ న్యూస్, ఆర్మూర్: పట్టణంలో 18వ వార్డు ఇంచార్జ్ ఎస్ కే బబ్లు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు మార్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి లు హాజరై కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందని, అర్హులైన పేదవారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, AMC డైరెక్టర్ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తైసిన్, జిమ్మి రవి, తాజా మాజీ కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్, అబ్దుల్ మోసిన్, పసుపుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.