
జయ్ న్యూస్, బిచ్కుంద ( మే 30): బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ గా హయ్యూమ్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇటీవల ఆర్మూర్ మున్సిపాలిటీలో మేనేజర్ గా విధులు నిర్వహించారు. పదోన్నతిపై నేడు బిచ్కుంద కమిషనర్ గా హయ్యూమ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, ప్రజలు కూడా తమకు సహకారం అందించాలని కోరారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈరోజు పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.