
జయ్ న్యూస్, ఆర్మూర్: మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని 24 వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వార్డు ఇంచార్జ్ మట్టెల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు- AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కాలనీవాసులు డేవిడ్, బొండ్ల రాజేశ్వర్, మల్లయ్య, కృష్ణయ్య, ప్రభు చరణ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.