
జయ్ న్యూస్, డొంకేశ్వర్: నాగార్జున యూనివర్సిటీ బెంగళూర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ చదువుతున్న డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన శ్రీ రామ్ అఖిల్ చారి, మానస ట్రస్ట్ చిక్బల్లాపూర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు దుప్పట్లు మరియు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు వివిధ వర్గాల నుండి అభినందనలు, ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల HOD of csc data science డాక్టర్ సయ్యద్ నహమతుల్లా హుస్సేన్, సుష్మ మరియు NCET విద్యార్థులు పాల్గొన్నారు.