
జయ్ న్యూస్, భీమ్ గల్: మండల కేంద్రంలో పలు విత్తనాలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఎస్సై జి. మహేష్ శనివారం తనిఖీ చేశారు. విత్తనాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. విత్తనాలకు సంబంధించిన స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేసి దుకాణాలు సిజ్ చేస్తామని హెచ్చరించారు. విక్రయాలకు సంబంధించిన బిల్లులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. అన్ని లైసెన్సులకు సంబంధించిన రిజిస్టర్లను విధిగా మెయింటెన్ చేయాలని తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారితో సంతకం చేయించాలని, ఎట్టి పరిస్థితుల్లో లూస్ సీడ్ అమ్మరాదని తెలిపారు. ఎప్పటికప్పుడు వచ్చిన స్టాక్ రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని అన్ని లైసెన్సులను కనబడే విధంగా డిస్ప్లే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఎస్సై జి. మహేష్, విత్తన డీలర్లు పాల్గొన్నారు.