
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ప్రతి ఆదివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ కమిటి చైర్మన్ రేగుల్ల సత్యనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో “ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సంస్థ” ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఆదివారం ఒక దేవాలయాన్ని ఎంచుకొని ఆలయంలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీమన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఇట్టి కార్యక్రమాని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 6వ వారం జంబి హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రేగుల్ల సత్యనారాయణ సహకారంతో ఆలయంలోని చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, జీడి రాజ్ కుమార్, ఆంజనేయులు, గణేష్, బాశెట్టి పెద్ద గంగారాం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.