
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BRS రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ గత 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.