
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలో సోమవారం గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు, గ్రామ యువకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా మూసి ఉన్న గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరగా, చైర్మన్ స్పందిస్తూ “త్వరలోనే ఆలూర్లో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. అలాగే సుమారు 40 లక్షల రూపాయలతో నూతన భవనం నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కృషి చేస్తాను,” అని హామీ ఇచ్చారు. అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియలు చేపడుతున్న తరుణంలో నిరుద్యోగులు, యువత గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, నిజాంసాగర్ లిఫ్ట్ మాజీ చైర్మన్ యల్లా సాయిరెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, దుమ్మాజీ శ్రీనివాస్, కుమ్మరి మల్లేష్,భాస్కర్, సంజీవ్, చిరంజీవి, యోగేష్ గౌడ్, శ్రీకాంత్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.