
జయ్ న్యూస్, ఆర్మూర్: మున్సిపల్ పరిధి యోగేశ్వర కాలనీ లోని 25వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో తలపెట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సును మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు గుపాల భుపేందర్ మాట్లాడుతూ వార్డులో ఉన్న డ్రైనేజీలను కమిషనర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రజలు తమ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని నాయకులు భూపేందర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం ఈనెల రెండవ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.