
జయ్ న్యూస్, ఆర్మూర్ జూన్ 03: నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో లో నూతనంగా నియామకం అయినా కమిటీ సభ్యులు అందరు గత పాలక వర్గానికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది. సన్మానం అనంతరం మాజీ అధ్యక్షులు నరేందర్, మాజీ ఉపాధ్యక్షలు వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము చేయిన పనులను మరి ఒక్క సారి గుర్తు చేస్తూ సభ్యులందరికి ఉపయోగ పడే విధంగా మన పాలనా ఉండాలని జర్నలిస్ట్ లకు స్థలాల విషయంలో ప్రభుత్వంతో సానుకూలంగా పోరాడి సాధించాలని కొనియాడారు. ప్రతి సభ్యులు ప్రేమ మమకారాలతో కుటుంబ సభ్యుల వాలే కలిసి ఉండాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్, ప్రధాన కార్య దర్శి వినోద్, ఉపాధ్యక్షులు చిరంజీవి, కోశాధికారి శ్రవణ్, జాయింట్ సెక్రటరీ ముకేశ్, మాజీ అధ్యక్షలు నరేందర్, ఉపాధ్యక్షలు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశధికారి మహిపాల్, రాజేందర్, దినేష్ మరియు సభ్యులు గంగమోహన్,మనోహర్,గణేష్ శిఖరి శ్రీనివాస్, రిషిత్, కిరణ్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.