
జయ్ న్యూస్, సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్, పెద్ద వాల్గోట్, న్యావనంది, తూంపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి కి మండల ప్రజల తరఫున, లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తూంపల్లి లక్ష్మణ్, గోవర్ధన్ రెడ్డి, మైపాల్, సాయ రెడ్డి, ప్రవీణ్ వీరు, రాములు, నర్సారెడ్డి, జాగిరపు నర్సారెడ్డి , సురేందర్ రెడ్డి, నర్సింగ్, నరేందర్, జనార్దన్ , ముత్తెన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.