
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి 19వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల 10వ తేదీ వరకు నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, 19వ వార్డు ఇంచార్జ్ విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు తమవంతుగా సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, కాంగ్రెస్ యువజన నాయకులు బత్తుల శ్రీనివాస్ గౌడ్, వంశీ, శివ, సిద్దు, బన్నీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.