
జయ్ న్యూస్, ఆర్మూర్: ప్రతినిత్యం ప్రజా సమస్యలపై, కొత్తగా సమస్యలను వెలికి తీయడంలో సమాజంలో తమ వంతుగా తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులను సన్మానించడం ఆనందంగా ఉందని ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. గురువారం ప్రెస్ క్లబ్ భవనంలో నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతోపాటు వారి కార్యవర్గ సభ్యులను ఆయన సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం ప్రజల సమస్యలను సమాజానికి తెలిసే విధంగా ప్రయత్నించడం గొప్ప విషయమని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా జర్నలిస్టులు నిరంతరం ప్రాణాలు పణంగా పెట్టి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమాజంలో గురుత్వార బాధ్యతగా జర్నలిస్టులు వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ని కూడా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావత్రి రాజశేఖర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్, సునీల్, సలహాదారులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, కోశాధికారి అజీమ్, కార్యవర్గ సభ్యులు సామ మురళి, చేతన్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, అర్గుల్ నర్సయ్య, రాంప్రసాద్, శేఖర్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtu.be/EnXaJlWgp5A?si=saBQtZqYftVDO1di