
జయ్ న్యూస్, భీమ్ గల్: భీంగల్ మండలంలోని ఐటిఐ కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ ఆండాలు తెలిపారు. 2025- 2026/27 విద్యా సంవత్సరానికి ఈనెల 2 నుంచి 21 తేదీ వరకు http://iti. Telangana.gov.in వెబ్సైట్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు తమ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలని సూచించారు.