
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంకాపూర్ కు చెందిన నరేష్ చారిని నియమించడం జరిగింది. గతంలో ఈయన బీజేవైఎం ఆర్మూర్ మండల అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. నరేష్ చారి మాట్లాడుతూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్, రోహిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అందాపూర్ రాజేష్, సురేంద్ర తదితరులున్నారు.