
జయ్ న్యూస్, ఆలూర్: మాల మహానాడు మండల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆలూర్ మండల కేంద్రంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏకగ్రీవంగా అగ్గు క్రాంతిని ఆలూర్ మండల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అదే విధంగా కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శిగా చిట్టీ బాబు (మిర్దపల్లి), ఉపాధ్యక్షులుగా దండు రవి (మచర్ల), కోశాధికారిగా పిట్ల శోభన్ (గుత్ప)లను నియమించారు. ఈ సందర్బంగా అగ్గు క్రాంతి మాట్లాడుతూ మాల మహానాడు బలోపేతానికి, సామాజిక న్యాయ సాధన దిశగా కమిటీ కృషి చేస్తుందని అన్నారు.