
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండల మాల మహానాడు అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన అగ్గు క్రాంతిని ఆలూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కార్యకర్తలు, టౌన్ యువజన అధ్యక్షుడు పృథ్వి రాజ్, స్పైసీ రోహిత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.