
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేవాలయాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ఆదర్శమని రామాలయం అధ్యక్షులు కొక్కుల లింగం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్లో గల రామాలయంలో “ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ” ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో దేవాలయాల్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఈ సేవలు మరింత విస్తరించి పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో 7 వారాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రామాయంలో ఆలయ కమిటి సభ్యులు, భక్తుల సహకారంతో చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుద్దేటి రమేష్, గంగామోహన్ చక్రు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, జీడి రాజ్ కుమార్, కర్తన్ మధుసుధన్, పుతాడి ఎల్లయ్య, జంగిడి బోజన్న, నూకల ఆదిత్యయ, గణేష్, బాశెట్టి పెద్ద గంగారాం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.