
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి 24 వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు ఇంచార్జ్ మట్టెల శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయేది వర్షాకాలం కావున ఏ సమస్య వచ్చినా అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.