
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో 20 మరియు 24 వార్డులో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సును మున్సిపల్ అధికారులు నిర్వహించారు. వార్డులలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ రాజు పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఆదేశానుసారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు అధికారులు హేమంత్, శ్రీకాంత్, సానిటరీ జవాన్లు గోపి, రాజన్న తదితరులున్నారు.