
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పద్మశాలి ఐదవ తర్ప రాంనగర్ సంఘ సభ్యులకు ఇచ్చిన హామీ మేరకు సోమవారం ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ సంఘ భవన ప్రాంగణంలో ఫ్లోరింగ్ భూమి పూజ నిర్వహించారు. అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ ఏ అధికారం లేకున్నా ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంత నిధులతో ఈ పనులు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ మానవ విలువల కన్నా డబ్బు ప్రధానం కాదన్నారు. సమాజ శ్రేయస్సు కొరకు ఇక్కడే ఉండి తాను సంపాదించే దాని నుండి కొంత వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ER ఫౌండేషన్ ప్రతినిధులు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.