
జయ్ న్యూస్, ఆర్మూర్ జూన్ 09: నూతనంగా ఎన్నుకోబడ్డ నవనాతపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్, కార్యదర్శి తమ్మె వినోద్ తో పాటు కార్యవర్గానికి ఆర్మూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్ సోమవారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ… నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పని చేసే జర్నలిస్టుల సేవలు అమోగమన్నారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన నివాసంలో మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ శాలువాలతో ఆయన సత్కరించి మాట్లాడుతూ…. సాహసం కలిగినటువంటి వ్యక్తులే విలేకరులుగా ఉంటారని వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నేను భావిస్తానని పేర్కొన్నారు. నిప్పులాంటి వార్తలు వెలికితీస్తూ ప్రజలను చైతన్య వంతులుగా చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అమృతల శ్రావణ్, ఉపాధ్యక్షుడు గంధం చిరంజీవి, కోశాధికారి లిక్కి శ్రావణ్, సలహాదారులు బి మహేష్ , షికారి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.