
జయ్ న్యూస్, ఆలూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బేబీ శివాన్షి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం గాంధీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి LOC ద్వారా 1,50,000/- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు LOC కాఫీని ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దంపతులు అందజేశారు. LOC కాపీ ఇప్పించిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దంపతులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.